పదవతరగతి అర్హతతో ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..
- October 23, 2018
దేశంలోని వివిధ సబ్సిడరీ ఇంటిలిజెన్స్ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కేంద్ర హోంమత్రిత్వ శాఖ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1054 (తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 20, తెలంగాణలో 36 పోస్టులు ఉన్నాయి)
అర్హత: పదవతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.
ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరి. ఇంటిలిజెన్స్ వర్క్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వయసు: 27 సంవత్సరాలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా రెండు దశల్లో జరిగే ఈ రాత పరీక్ష మొదటి దశలో జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేస్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. రెండో దశలో డిస్క్రిప్షన్ పేపర్ ఉంటుంది.
పే స్కేల్: రూ.5,200 – 20,200 + గ్రేడ్ పే రూ. 2,000/- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులు ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ సహా దేశ వ్యాప్తంగా 34 సెంటర్లలో నిర్వహిస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.10.2018
దరఖాస్తుకు చివరి తేదీ: 10.11.2018
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 13.11.2018
మరిన్ని వివరాలకు వెబ్సైట్: https://mha.gov.in/
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







