పదవతరగతి అర్హతతో ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..
- October 23, 2018
దేశంలోని వివిధ సబ్సిడరీ ఇంటిలిజెన్స్ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కేంద్ర హోంమత్రిత్వ శాఖ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1054 (తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 20, తెలంగాణలో 36 పోస్టులు ఉన్నాయి)
అర్హత: పదవతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.
ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరి. ఇంటిలిజెన్స్ వర్క్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వయసు: 27 సంవత్సరాలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా రెండు దశల్లో జరిగే ఈ రాత పరీక్ష మొదటి దశలో జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేస్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. రెండో దశలో డిస్క్రిప్షన్ పేపర్ ఉంటుంది.
పే స్కేల్: రూ.5,200 – 20,200 + గ్రేడ్ పే రూ. 2,000/- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులు ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ సహా దేశ వ్యాప్తంగా 34 సెంటర్లలో నిర్వహిస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.10.2018
దరఖాస్తుకు చివరి తేదీ: 10.11.2018
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 13.11.2018
మరిన్ని వివరాలకు వెబ్సైట్: https://mha.gov.in/
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







