సీబీఐ ఇంఛార్జ్ డైరెక్టర్ గా తెలుగువ్యక్తి
- October 24, 2018
సీబీఐ కొత్త ఇంఛార్జ్ డైరెక్టర్గా మన్నెం నాగేశ్వర్రావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సీబీఐ జాయింట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ముడుపుల ఆరోపణలతో అలోక్వర్మను పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ఇంఛార్జి డైరెక్టర్గా మన్నెంను నియమించారు. అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాలను సెలవులో వెళ్లాలని కేంద్రం కోరింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే నాగేశ్వర రావు రంగంలోకి దిగారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలోని 10, 11 ఫ్లోర్లలో తనిఖీలు జరిపారు. ఆస్థానా, దేవేందర్ తో పాటు మరి కొందరి చాంబర్లలో సోదాలు నిర్వహించారు.
మన్నెం నాగేశ్వర్రావు 1986 ఐపీఎస్ బ్యాచ్కు చెందినవారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా మంగపేట మండలం బోర్ నరసాపురం. ఆయన తల్లిదండ్రులు శేషమ్మ, పిచ్చయ్య. మన్నెం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మంగపేటలో చదివారు. 8 నుంచి 10 తరగతులు తిమ్మంపేట జడ్పీ హైస్కూల్ లో పూర్తి చేశారు. ఇంటర్ విద్యను వరంగల్ ఏవీవీ జూనియర్ కాలేజీలో అభ్యసించారు. వరంగల్ దేశాయ్పేట CKM కాలేజీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశారు. PHD చేస్తున్న సమయంలోనే 1986 సివిల్స్ రాసి కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారు. ఒడిషా కేడర్ కు ఎంపికైన ఆయన ఎక్కువ కాలం ఛత్తీస్ గఢ్ లోనే పనిచేశారు. ఓడిషా డీజీపీగా కూడా విధులు నిర్వహించారు. ఏడాదిన్నరగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న ఆయన్ను సీబీఐలో వివాదాల నేపథ్యంలో కేంద్రం ఇంఛార్జి డైరెక్టర్ గా నియమించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







