మలయాళంలో మాట్లాడనున్న రంగస్థలం చిట్టిబాబు
- October 24, 2018
పల్లెటూరి నేపథ్యంతో సుకుమార్ తెరకెక్కించిన అద్భుత చిత్రం రంగస్థలం. రామ్ చరణ్ చెవిటి వ్యక్తిగా ఈ చిత్రంలో కనిపించాడు. సమంత పల్లెటూరి అమ్మాయిగా అదరగొట్టింది. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయలు తమ తమ పాత్రలలో జీవించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. విమర్శకులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారంటే ఈ చిత్రం ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2018' లోను 'రంగస్థలం' ఎంపికైంది. ఉత్తమ చిత్ర విభాగంలో ఈ సినిమాని ఎంపిక చేశారు. చైనాలో ను ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి కేరళలో రిలీజై భారీ వసూళ్లు సాధించగా, ఇప్పుడు రంగస్థలం చిత్రాన్ని కూడా కేరళలో విడుదల చేయబోతున్నారు. బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆర్డీఐ ఇల్యుమినేషన్ రంగస్థలం మూవీ ని కేరళలో రిలీజ్ చేయనుంది. భాగమతి, భరత్ అనే నేను, గీత గోవిందం, అరవింద సమేత చిత్రాలని కూడా ఈ సంస్థ కేరళలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. నవంబర్లో రంగస్థలం మలయాళ వర్షెన్ కేరళలో విడుదల కానున్నట్టు సమాచారం. అక్కడ కూడా ఈ మూవీ భారీ విజయం సాధిస్తుందని టీం భావిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







