మలయాళంలో మాట్లాడనున్న రంగస్థలం చిట్టిబాబు
- October 24, 2018
పల్లెటూరి నేపథ్యంతో సుకుమార్ తెరకెక్కించిన అద్భుత చిత్రం రంగస్థలం. రామ్ చరణ్ చెవిటి వ్యక్తిగా ఈ చిత్రంలో కనిపించాడు. సమంత పల్లెటూరి అమ్మాయిగా అదరగొట్టింది. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయలు తమ తమ పాత్రలలో జీవించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. విమర్శకులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారంటే ఈ చిత్రం ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2018' లోను 'రంగస్థలం' ఎంపికైంది. ఉత్తమ చిత్ర విభాగంలో ఈ సినిమాని ఎంపిక చేశారు. చైనాలో ను ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి కేరళలో రిలీజై భారీ వసూళ్లు సాధించగా, ఇప్పుడు రంగస్థలం చిత్రాన్ని కూడా కేరళలో విడుదల చేయబోతున్నారు. బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆర్డీఐ ఇల్యుమినేషన్ రంగస్థలం మూవీ ని కేరళలో రిలీజ్ చేయనుంది. భాగమతి, భరత్ అనే నేను, గీత గోవిందం, అరవింద సమేత చిత్రాలని కూడా ఈ సంస్థ కేరళలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. నవంబర్లో రంగస్థలం మలయాళ వర్షెన్ కేరళలో విడుదల కానున్నట్టు సమాచారం. అక్కడ కూడా ఈ మూవీ భారీ విజయం సాధిస్తుందని టీం భావిస్తుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







