'వాయిస్ ఆఫ్ ఖలీఫా' పేరిట రేడియో స్టేషన్
- December 20, 2015
ఆప్ఘనిస్తాన్ లోని ఇస్లామిక్ స్టేట్ అనుకూల ఉగ్రవాదులు సొంతంగా ఓ రేడియో స్టేషన్ ను ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా తమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. రేడియో కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ.. యువతను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. ఈ విషయాన్ని ఆప్ఘనిస్తాన్ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఉగ్రవాదులు 'వాయిస్ ఆఫ్ ఖలీఫా' పేరిట రేడియో స్టేషన్ ను ఏర్పాటు చేసి స్థానిక 'పాష్తో' భాషలో తమ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. జలాలాబాద్, ఇతర జిల్లాల్లో ఈ రేడియో ప్రసారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన పదజాలంతో ప్రసారాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు రేడియో స్టేషన్ కార్యకలాపాలు ఎక్కడి నుండి నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే రేడియో ప్రసారాలు ప్రజలకు చేరకుండా తగు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







