ఫేక్‌ న్యూస్‌ ప్రచారం: దయీష్‌ మిలిటెంట్‌కి 15 ఏళ్ళ జైలు

- October 25, 2018 , by Maagulf
ఫేక్‌ న్యూస్‌ ప్రచారం: దయీష్‌ మిలిటెంట్‌కి 15 ఏళ్ళ జైలు

అబుదాబీ ఫెడరల్‌ సుప్రీమ్‌ కోర్ట్‌, దయీష్‌కి చెందిన తీవ్రవాదికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్‌ కూడా చేయనున్నారు. 45 ఏళ్ళ అరబ్‌ జాతీయుడు, దయీష్‌ మిలిటెంట్‌గా పనిచేస్తున్నాడు. యూఏఈ భద్రతకు నష్టం వాటిల్లేలా ఫేక్‌ న్యూస్‌ని, రూమర్స్‌ని ప్రచారం చేస్తున్నట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. అతని నుంచి పలు రకాలైన ఎలక్ట్రానిక్‌ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదిలా వుంటే మరో 27 ఏళ్ళ జీసీసీ పౌరుడికి మూడేళ్ళ జైలు శిక్ష, 500,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది న్యాయస్థానం. ఇద్దరు ఎమిరేటీ జాతీయులకి మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌కి పంపారు. వీరికి టెర్రిరిస్ట్‌ థ్రెట్‌ అభియోగాలున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com