దుబాయ్ టూరిస్టులు వ్యాట్ని వెనక్కి పొందే అవకాశం
- October 25, 2018
యూఏఈ అధికారులు తాజాగా వెల్లడించిన ఇనీషియేటివ్ ప్రకారం దుబాయ్ టూరిస్టులు వ్యాట్ని వెనక్కి పొందేందుకు అవకాశం వుంది. నవంబర్ 18 నుంచి, దుబాయ్లో కొనుగోలు చేసే పలు రకాలైన వస్తువులపై వాల్యూ యాడెడ్ టాక్స్ని టూరిస్టులు వెనక్కి పొందవచ్చు. జనవరిలో పలు రకాలైన ప్రోడక్ట్స్పై 5 శాతం వ్యాట్ యూఏఈలో అమల్లోకి వచ్చిన సంగతి తెల్సిందే. అబుదాబీ, దుబాయ్, షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఫస్ట్ ఫేజ్ని అమలు చేస్తున్నట్లు ఫెడరల్ ట్యాక్స్ అథారిటీ వెల్లడించింది. దాంతో, నవంబర్ 18 నుంచి జారీ చేసే ఇన్వాయిస్లపై ట్యాక్స్ రిఫండ్ని టూరిస్టులు పొందడానికి వీలుంటుంది. ఈ సిస్టమ్తో యూఏలోని 4,000 షాప్లు, రిటెయిల్ ఔట్లెట్స్ కనెక్ట్ అయ్యే అవకాశం వుంది. అలా కనెక్ట్ అయ్యే షాప్లు, ఔట్లెట్స్.. వ్యాట్ రిఫండ్పై సమాచారాన్ని డిస్ప్లే చేస్తాయి కూడా. గ్లోబల్ టూరిజం మార్కెట్లో యూఏఈ ఈ నిర్ణయంతో మరింతగా రాణిస్తుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







