బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ చేసిన పనికి కంపెనీ ఫైర్
- October 25, 2018
నటీనటులు, సెలబ్రెటీలు కంపెనీ వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. సేల్స్ పెంచుకునేందుకు కంపెనీలు యాడ్స్ మీద ఆధారపడుతుంటాయి. నిజంగా ఆ యాడ్లో నటించిన వాళ్లు వాడుతుంటారో లేదో తెలియదు కానీ ఇది వాడ్డం వల్లే నేను తెల్లగా అయ్యాను, ఇది తాగడం వల్లే నేనింత ఉత్సాహంగా ఉన్నాను అంటే పోలో మని ఆ వస్తువులు కొనేస్తుంటారు. ఫోన్ల విషయానికి వస్తే ఖరీదు తక్కువగా ఉండి, మన్నికగా ఉంటూ ఫీచర్లు ఎక్కువ వుంటే దాన్ని తీసుకోవడానికే ఇష్టపడుతుంటారు. ఈ విషయాలన్నీ చెప్పడానికి కంపెనీ కొన్ని కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చి ఆ వస్తువు పబ్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్లను ఏర్పాటు చేస్తుంది. రష్యాకు చెందిన మోడల్ క్సేనియా సోబ్చక్ శాంసంగ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.
యాడ్లో ఈ ఫోన్ వాడండి అని చెప్పడం బాగానే ఉంది కానీ తను మాత్రం ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ వాడి అడ్డంగా బుక్కయింది. ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఆమె మొబైల్ చేతబట్టుకుని వచ్చింది. అక్కడకు వచ్చిన తరువాత గుర్తొచ్చినట్టుంది. ఆపిల్ ఫోన్ దాచే ప్రయత్నం చేసింది. అయితే కెమేరా కన్నునుంచి తప్పించుకోలేకపోయింది. దీంతో శాంసంగ్ సంస్థ ఆమెకు 1.6 మిలియన్ అమెరికన్ డాలర్ల జరిమానా విధించింది. (భారత్ కరెన్సీలో రూ.11,71,84,000). గతంలోనూ ఇదే విషయమై వివాదంలో చిక్కుకుంది. తమ కంపెనీ పరువు తీస్తుందని భావించిన శాంసంగ్ సంస్థ క్సేనియాకు భారీ జరిమానా విధించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







