ట్రక్ ఢీకొని సైక్లిస్ట్ మృతి
- October 27, 2018
ఆసియాకి చెందిన 41 ఏళ్ళ వ్యక్తి ట్రక్ ఢీకొనడంతో మృతి చెందాడు. రస్ అల్ ఖైమాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో ఓ వ్యక్తి సైకిల్ మీద వెళుతుండగా, ఓవర్ టర్న్ అయిన ట్రక్ కారణంగా అతను మృతి చెందినట్లు మామురా పోలీస్ స్టేషన్ చీఫ్ కల్నల్ వలీద్ కాన్ఫాష్ పేర్కొన్నారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పెట్రోల్, అంబులెన్స్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు అధికారులు. భారీ ట్రక్కుని 34 ఏళ్ళ ఆసియా వ్యక్తి నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనం అదుపు తప్పడమే ఈ ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. తీవ్ర గాయాలు కావడంతో, రక్తస్రావం ఎక్కువగా జరిగి సైక్లిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని హాస్పిటల్ మార్గ్కి తరలించారు. వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా వుండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







