ట్రక్ ఢీకొని సైక్లిస్ట్ మృతి
- October 27, 2018
ఆసియాకి చెందిన 41 ఏళ్ళ వ్యక్తి ట్రక్ ఢీకొనడంతో మృతి చెందాడు. రస్ అల్ ఖైమాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో ఓ వ్యక్తి సైకిల్ మీద వెళుతుండగా, ఓవర్ టర్న్ అయిన ట్రక్ కారణంగా అతను మృతి చెందినట్లు మామురా పోలీస్ స్టేషన్ చీఫ్ కల్నల్ వలీద్ కాన్ఫాష్ పేర్కొన్నారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పెట్రోల్, అంబులెన్స్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు అధికారులు. భారీ ట్రక్కుని 34 ఏళ్ళ ఆసియా వ్యక్తి నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనం అదుపు తప్పడమే ఈ ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. తీవ్ర గాయాలు కావడంతో, రక్తస్రావం ఎక్కువగా జరిగి సైక్లిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని హాస్పిటల్ మార్గ్కి తరలించారు. వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా వుండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







