మరో ‘మెగా’ వారసుడు వచ్చేస్తున్నాడు

- October 27, 2018 , by Maagulf
మరో ‘మెగా’ వారసుడు వచ్చేస్తున్నాడు

మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సోదరిని కుమారుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలీవుడ్ లో నిలదొక్కుకున్నాడు. తాజాగా అయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. సక్సెస్ ఫుల్ ఫిలిం మేకింగ్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చి బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూరుస్తున్నాడు. పూర్తి వివరాలు మరికోద్ది రోజుల్లో వెల్లడయ్యే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com