భారత్కు విండీస్ షాక్..
- October 27, 2018
భారత టూర్లో వెస్టిండీస్ ఎట్టకేలకు తొలి విజయాన్ని రుచి చూసింది. పుణే వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియాకు షాకిచ్చింది. ఆసక్తికరంగా సాగిన పోరులో కరేబియన్ టీమ్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన విండీస్ 283 పరుగులు చేసింది. ఒక దశలో 150 కూడా దాటదనుకున్న ఆ జట్టు హోప్ సూపర్ ఇన్నింగ్స్తో కోలుకుంది.
ఛేజింగ్లో భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. కోహ్లీ తప్పిస్తే… మిగిలిన బ్యాట్స్మెన్ క్రీజులో నిలవలేదు. తన సూపర్ ఫామ్ కొనసాగించిన కోహ్లీ 38వ సెంచరీతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. కోహ్లీ 107 పరుగులకు ఔటయ్యాక.. టెయిలెండర్లు చేతులెత్తేయడంతో భారత్ 240 పరుగులకు ఆలౌటైంది. దీంతో సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







