త్వరలో రెడ్-ఐ విమానాలు..వీటిలో టికెట్ ధరలు బాగా తక్కువ
- October 27, 2018
ముంబై: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా త్వరలో కొత్త తరహా విమాన సర్వీసులు ప్రారంభించనుంది. 'రెడ్- ఐ' అ నే పేరుతో ఈ విమానాలు తిరుగుతాయి. నవంబరు నెలాఖరు నుంచి ఈ కొత్త సర్వీసులు మొదలవుతా యి. సాధారణంగా ఈ తరహా విమానాలు రాత్రిపూట బయల్దేరి, తెల్లవారుజామున గమ్యస్థానాలకు చేరుకుంటాయి. వీటిలో టికెట్ ధరలు బాగా తక్కువగా ఉంటాయి. దాంతో ఇప్పటికే అవెురికా, యూరోపియన్ దేశాలలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఢిల్లీ- గోవా-ఢిల్లీ, ఢిల్లీ-కోయంబత్తూరు-ఢిల్లీ, బెంగళూరు-అహ్మదాబాద్-బెంగళూరు మార్గాలలో నవంబరు 30 నుంచి ఈ రెడ్ ఐ విమానాలు నడుస్తాయని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఇవి ప్రతిరోజూ ఉంటాయి. ఎయిరిండియా విమానం ఏఐ883 ఢిల్లీలో రాత్రి 10 గంటలకు బయల్దేరి, 12.35 గంటలకు గోవా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏఐ884 విమానం గోవాలో అర్ధరాత్రి 1.15కు బయల్దేరి, తెల్లవారుజామున 3.40 గంటలకు ఢిల్లీ వస్తుంది. అలాగే కోయంబత్తూరు వెళ్లడానికి ఏఐ547 విమానం రాతి 9.15కు బయల్దేరి, కోయంబత్తూరుకు 12.30కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కోయంబత్తూరులో ఏఐ548 విమానం రాత్రి 1గంటకు బయల్దేరి తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.బెంగళూరు నుంచి అహ్మదాబాద్ వెళ్లే ఏఐ589 విమానం బెంగళూరులో రాత్రి 12.30కు బయల్దేరి, 2.35కి అహ్మదాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తెల్లవారుజామున 3.05 గంటలకు బయల్దేరి, బెంగళూరులో 5.25 గంటలకు ల్యాండ్ అవుతుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







