త్వరలో రెడ్-ఐ విమానాలు..వీటిలో టికెట్ ధరలు బాగా తక్కువ
- October 27, 2018
ముంబై: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా త్వరలో కొత్త తరహా విమాన సర్వీసులు ప్రారంభించనుంది. 'రెడ్- ఐ' అ నే పేరుతో ఈ విమానాలు తిరుగుతాయి. నవంబరు నెలాఖరు నుంచి ఈ కొత్త సర్వీసులు మొదలవుతా యి. సాధారణంగా ఈ తరహా విమానాలు రాత్రిపూట బయల్దేరి, తెల్లవారుజామున గమ్యస్థానాలకు చేరుకుంటాయి. వీటిలో టికెట్ ధరలు బాగా తక్కువగా ఉంటాయి. దాంతో ఇప్పటికే అవెురికా, యూరోపియన్ దేశాలలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఢిల్లీ- గోవా-ఢిల్లీ, ఢిల్లీ-కోయంబత్తూరు-ఢిల్లీ, బెంగళూరు-అహ్మదాబాద్-బెంగళూరు మార్గాలలో నవంబరు 30 నుంచి ఈ రెడ్ ఐ విమానాలు నడుస్తాయని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఇవి ప్రతిరోజూ ఉంటాయి. ఎయిరిండియా విమానం ఏఐ883 ఢిల్లీలో రాత్రి 10 గంటలకు బయల్దేరి, 12.35 గంటలకు గోవా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏఐ884 విమానం గోవాలో అర్ధరాత్రి 1.15కు బయల్దేరి, తెల్లవారుజామున 3.40 గంటలకు ఢిల్లీ వస్తుంది. అలాగే కోయంబత్తూరు వెళ్లడానికి ఏఐ547 విమానం రాతి 9.15కు బయల్దేరి, కోయంబత్తూరుకు 12.30కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కోయంబత్తూరులో ఏఐ548 విమానం రాత్రి 1గంటకు బయల్దేరి తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.బెంగళూరు నుంచి అహ్మదాబాద్ వెళ్లే ఏఐ589 విమానం బెంగళూరులో రాత్రి 12.30కు బయల్దేరి, 2.35కి అహ్మదాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తెల్లవారుజామున 3.05 గంటలకు బయల్దేరి, బెంగళూరులో 5.25 గంటలకు ల్యాండ్ అవుతుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







