యూఏఈ తొలి శాటిలైట్ నింగిలోకి..!
- October 28, 2018
యూఏఈ:చారిత్రక ఘట్టానికి సర్వం సిద్ధమయ్యింది. జపాన్లోని తనెగాషిమా దీవి నుంచి యూఏఈ తొలి శాటిలైట్ 'ఖలీఫా శాట్'ని నింగిలోకి పంపుతున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని అందరూ వీక్షించేందుకోసం లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. యూఏఈ టైమింగ్ ఉదయం 8 గంటల నుంచి ఇది ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించబోతున్నారు. ఖలీఫా శాట్ని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఎర్త్ అబ్జర్వింగ్ శాటిలైట్గా అభివర్ణిస్తున్న సంగతి తెల్సిందే. మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (ఎంబిఆర్ఎస్సి) ఈ లైవ్ స్ట్రీమింగ్కి ఏర్పాట్లు చేసింది. ఖలీపా శాటిలైట్, హై క్వాలిటీ ఇమేజెస్ని అందించనుంది. సుమారు 70 మంది శాస్త్రవేత్తలు ఈ శాటిలైట్ తయారీలో కీలక భూమిక పోషించారు. వీరిలో 10 మంది జపాన్కి వెళ్ళి అక్కడినుంచి శాటిలైట్ లాంచ్ని పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!