ఎన్నారైలకు సమాచార హక్కు..!
- October 29, 2018
దిల్లీ: ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం భారతీయులకు మాత్రమే ఆ అవకాశం ఉంది. ఇక నుంచి ప్రవాస భారతీయులు(ఎన్నారై)కు కూడా ఆర్టీఐ కింద పాలనా పరమైన అంశాల సమాచారం కోరవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రటకించింది. దీనికి సంబంధించిన సవరణలను చేసింది.
'సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం.. కేవలం భారతీయ పౌరులకు మాత్రమే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకునే హక్కు ఉంది. ఎన్నారైలు అందుకు అర్హులు కాదు' అని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ దీన్ని లోకేష్ బత్రా అనే సామాజిక కార్యకర్త వ్యతిరేకించారు. ఈ మేరకు కేవలం భారతీయుడికి మాత్రమే సహ చట్టం ద్వారా అన్ని విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటూ ఆయన సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఈ మేరకు దీన్ని మరోసారి పరిశీలించిన ప్రభుత్వం ఎన్నారైలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఎన్నారైలు కూడా సహ చట్టం ద్వారా పాలనా పరమైన విషయాలను తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సవరించిన విధానాన్ని లోక్సభ వెబ్సైట్లో పొందుపరిచింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







