ఇస్తాంబుల్ లో కొత్త ఎయిర్పోర్టు ను ప్రారంభించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్
- October 29, 2018
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో కొత్త ఎయిర్పోర్టు ప్రారంభమైంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ విమానాశ్రయాన్ని సోమవారం ప్రారంభించారు. త్వరలో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం అవుతుందని పేర్కొన్నారు. బ్లాక్ సీ తీరంలో ఇస్తాంబుల్ ఎయిర్పోర్టును నిర్మించారు. ఏటా 9 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఆ సంఖ్య 20 కోట్లకు చేర వచ్చునని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 19,000 ఎకరాల్లో ఆరు రన్వేలతో అట్లాంటాలోని హార్ట్స్ఫీల్డ్-జాక్సన్ రికార్డులు బ్రేక్ చేస్తుందని భావి స్తున్నారు. ఎయిర్పోర్టు ఇంటీరియర్ టర్కిష్, ఇస్లామిక్ డిజైన్ల కలయికతో ఉంటుంది. తులీప్ షేప్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్కు 2016లో ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ అవార్డ్ లభిం చింది. ప్రయాణికులకు మొబైల్ అప్లికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అందిస్తున్న సేవలు హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్తో ఉన్నాయి. ఈ కొత్త ఎయిర్పోర్టు సేవలు డిసెంబర్లో అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత ఇస్తాంబుల్లోని అటాటుర్క్ ఎయిర్పోర్ట్ని ముసేసి వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఇక్కడి నుంచి మూడు డొమెస్టిక్ డెస్టినేషన్ల(అంకారా, అంతాల్య, ఇజ్మిర్)కు టర్కిష్ ఎయిర్లైన్స్ విమానాలను నడపనుంది. ఉత్తర సిప్రస్లోని ఎర్కాన్, బాకుల మధ్య రాకపోకలు సాగనున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









