మితిమీరిన వ్యాయామం తో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్
- December 20, 2015
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారంతో పాటు తగిన వ్యాయామం కూడా శరీరానికి అవసరమే. అయితే, అతి సర్వత్ర వర్జయేత్ అనే సూత్రం వ్యాయామానికీ వర్తిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన వ్యాయామం వల్ల ఆరోగ్యం మెరుగుపడటానికి బదులు అనర్థాలకు దారితీస్తుందని మరోసారి రుజువైనది. రోజుకు నాలుగు గంటలకు పైబడి వ్యాయామం చేస్తే, పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా రక్తంలో చేరుతుందని, దీనివల్ల రక్తం విషపూరితంగా మారి ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెడుతుందని వారు హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ మధ్య జరిపిన పరిశోధనల ద్వారా సుదీర్ఘ వ్యాయామాలు చేసేవారి రక్త నమూనాలను వ్యాయామానికి ముందు, వ్యాయామానికి తర్వాత సేకరించి, పరీక్షలు జరిపిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు చెబుతున్నారు. వ్యాయామాలు అధికంగా చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే. ఎప్పుడైతే ఎక్సెస్ వ్యాయాలు చేస్తారో అప్పుడు గాయాలపాలు కావాల్సి వస్తుంది . అధిక వ్యాయామం చేసేప్పుడు తగినంత రెస్ట్ అవసరం అవుతుంది. రెస్ట్ లేకుండా వ్యాయామాలు ఎక్కువ సమయం చేయడం వల్ల శరీరంలోని లిగమెంట్స్ స్ట్రెయిన్ అవుతాయి. దాంతో లింగమెంట్ గాయం అవుతుంది.దాంతో ఎముకల మీద చెడు ప్రభావం చూపించి ఎముకలు ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువ సమయం వ్యాయామం చేయడం వల్ల శరీరానికి అవసరం అయ్యే కణజాలాలన్నింటికి హాని కలిగిస్తుంది . మజిల్ మాస్ కోల్పోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. కండరాలను కోల్పోతున్నారంటే కొవ్వులను దహించే శక్తిని కూడా కోల్పోతున్నారని అర్థం. ఎముక సాంద్రతను కూడా కోల్పోతున్నారని కూడా అర్థం. ఇలా జీరోసైజ్ కోసం పడే తాపత్రయంలో మన ఆరోగ్యాన్నే కోల్పోతున్నారని వాస్తవాన్ని విస్మరిస్తుంటారు. శరీరాకృతిని మంచి సౌష్ఠవంలో ఉంచుకోవాలంటే మనం దహించాల్సినది కొవ్వులను. కండరాలను కాదు. ఎప్పుడైతే వ్యాయామాలు చేయాల్సిన సమయం కంటే ఎక్కువ చేస్తారో అప్పుడు వ్యాధినిరోధకశక్తి బలహీనపడుతుంది . దాంతో శరీరం చాలా త్వరగా వైరస్ బారిన పడటం, జలుబు, దగ్గుకు వంటి ఫ్లూకు గురికావడం జరగుతుంది. వ్యాయామం శరీరం మీద తీవ్రప్రభావాన్ని చూపుతుంది. దాంతో బ్యాక్టీరియా మరియు ఇతర ఇన్ఫెక్షన్స్ నాశనం చేయడానికి తగిని శక్తి సామర్థ్యాలను కోల్పోతుంది. ఫీమేల్ అథ్లెట్స్ ఎక్సెస్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్ వల్ల బోన్ లాస్ జరగిందని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడైనది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నివారించడం లేదా నయం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది . అలాగే డైట్ లో మార్పులు చేసుకోవడి, ఎక్సెసివ్ వెయిట్ లాస్ మిరయు స్ట్రెస్ లు అమెనోరియాకు దారితీస్తుంది. ఎవరైతే వ్యాయామాలకు అలవాటు పడి ఉంటారో, ముఖ్యంగా బరువు తగ్గాలనే కాన్సెఫ్ట్ తో అధిక వ్యాయామాలు చేసే వారు అపక్రమ ఆహారపు అలవాట్ల వల్ల బ్లూమియా లేదా అనెరెక్సియాకు దారితీస్తుంది. అధిక వ్యాయామాల వల్ల శరీరం ఎక్కువ అలసటకు గురై బద్దకంగా మరియు డీహైడ్రేట్ గా ఫీలవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మెదడు వంద మీటర్ల వేగంతో పరిగెడుతుంటుంది . మనస్సు ఆధీనంలో ఉండదు . ఇవన్నీ అదనపు వ్యాయామాల వల్ల జరుతాయంటే ఆశ్చర్యం కలగక మానదు. వ్యాయామల్లో ఓవర్ ట్రైనింగ్ వల్ల మజిల్ స్ప్రెన్ సింపుల్ గా మొదలైన తీవ్రస్థాయి చేరుకుంటుంది . కండరాలు ఎక్సెసివ్ స్ట్రెచింగ్ , ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల మజిల్ స్ప్రెయిన్ మేజర్ గా ఉంటుంది. వ్యాయామాలు అధికంగా చేయడం వల్ల శరీరంలోని నీరు మొత్తం ఆవిరైపోతుంది. లేదా చెమట రూపంలో కోల్పోవడం వల్ల ఇది శరీరంలో నీటిని కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతో డీహైడ్రేషన్, బ్లడ్ క్లాట్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువ సమయం వ్యాయామాలు, జిమ్స్ చేయడం వల్ల జెనిటిల్స్ ముఖ్యంగా టెస్టికల్స్ ష్రింక్ అవుతాయి . ముఖ్యంగా బాడీ మాస్ మరియు మజిల్ మాస్ ను టెస్టికల్స్ హైడ్ చేస్తాయి. మహిళలు అధిక సమయం వ్యాయామాలు చేయడం , స్ట్రెచ్చింగ్ వల్ల పెల్విక్ మజిల్స్ విస్తరించి, యోని మరింత లూజ్ గా మారుతుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









