నవంబరు 1 నుంచి ఈశాన్య ఋతుపవనాలు : భారత వాతవరణ శాఖ
- October 30, 2018
నవంబరు 1 నుంచి ఈశాన్య ఋతుపవనాలు మొదలు కానున్నాయని భారత వాతవరణ శాఖ తెలిపింది. ఈ ఈశాన్య ఋతుపవనాల వలన తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్టోబరు 20 నుంచే ఈశాన్య ఋతుపవనాలు మొదలు కావాలని, అయితే ఈ సంవత్సరం కాస్త ఆలస్యమైందని వారు తెలిపారు. కాగా ఇదివరకే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడాలని, కానీ ఈశాన్య ఋతుపవనాల ఆలస్యంతో ఏర్పడలేదని భారత వాతవరణ శాఖ (ఐఎండి) అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజ§్ు మహాపాత్ర తెలిపారు.ఈ వర్షాలు తమిళనాడు,పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, దక్షిణ కోస్తాలోని ప్రాంతాలు, కేరళలోని కొన్ని ప్రాంతాలలోని వ్యవసాయానికి కీలకమని తెలిపారు.ఈశాన్య ఋతుపవనాల ఆగమనాన్ని శ్రీలంక సమీపంలోని దక్షిణ బంగాళాఖాతం లోని గుర్తించామని, ఐదు రోజుల్లోనే వర్షాలు ప్రారంభం కానున్నాయని ఐఎండి పేర్కొంది. మరో వైపు నైరుతి ఋతుపవనాలు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అక్టోబరు 21 నుంచే నిష్క్రమించాయని ఐఎండి తెలిపింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







