2,600 కిలోలకు పైగా తేనె స్వాధీనం
- October 30, 2018
మస్కట్:2,670 కిలోల తేనె (హనీ)ను మస్కట్ మునిసిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తేనె తయారు చేస్తున్న, విక్రయిస్తున్న కేంద్రాలపై జరిపిన దాడుల్లో ఈ తేనె బయట పడింది. రువిలోని ఓ ఇంటిలో దీన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 30 కిలోల బరువు తూగే 89 కంటెయినర్స్తోపాటు, 134 బాటిల్స్ని ఈ సందర్భంగా అధికారులు సీజ్ చేయడం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గ్రేటర్ ముట్రా, రువిలోని ఓ ఇంటిపై దాడి చేసి అక్రమంగా తయారు చేస్తున్న హనీని స్వాధీనం చేసుకున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు