ఎ.పి. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యలందుకున్నది వీరే
- October 30, 2018
ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వితీయ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళగిరి మండలం ఆత్మకూరులోని హ్యాపీ రిసార్ట్స్లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో వాణిజ్య మండలి నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి కె.సురేష్బాబు ప్రకటించారు. అధ్యక్షుడిగా అంబటి మధుమోహన్కృష్ణ, ఉపాధ్యక్షులుగా పీవీఎస్.వర్మ(విజయవర్మ), బి.వెంకటేశ్వరరావు, ఎ.జయప్రకాశ్.., ప్రధాన కార్యదర్శిగా జేవీ. మోహన్గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.శ్రీనాథ్రావు, సుబ్బారావు కనగాల, జె.శ్రీనివాసరావు, కోశాధికారిగా పాలెపు రామారావు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా మధుమోహన్కృష్ణ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. తనను ఎ.పి. ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం పట్ల విజయ్ వర్మ పాకలపాటి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







