ఉక్కుమనిషికి ఘన నివాళిగా 'ఐక్యతా పరుగు'

- October 30, 2018 , by Maagulf
ఉక్కుమనిషికి ఘన నివాళిగా 'ఐక్యతా పరుగు'

నేడు దేశవ్యాప్తంగా భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జాతీయ స్టేడియం నుంచి ఇండియా గేట్‌ వరకు 1.5 కిలోమీటర్ల మేర సాగిన 'ఏక్తా రన్‌'ను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగులో క్రీడాప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో ఏర్పాటు చేసిన ఐక్యతా పరుగులో మంత్రులు, నేతలు, సినీ ప్రముఖులు, ప్రజలు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com