కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్, 25 మంది మృతి

- October 31, 2018 , by Maagulf
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్, 25 మంది మృతి

అఫ్గానిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫరా ప్రావిన్స్‌లో ఓ సైనిక విమానం కుప్పకూలి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఫరా ప్రావిన్స్‌లోని అనార్‌ దరా జిల్లా నుంచి హెరత్‌ ప్రావెన్స్‌కు బయల్దేరిన ఓ సైనిక విమానం బుధవారం ఉదయం 9.10 గంటల సమయంలో కూలిపోయింది. అనార్‌ దరా బేస్‌ నుంచి విమానం టేకాప్‌ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో విమానంలో '207 జాఫర్‌ మిలిటరీ కార్ప్స్‌' అధికారులతో పాటు ఫరా ప్రావిన్షియల్‌ కౌన్సిల్‌ సభ్యులు మొత్తం 25 మంది ఉన్నారు. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని జాఫర్‌ మిలిటరీ కార్ప్స్‌ అధికార ప్రతినిధి నజీబుల్లా నజీబీ తెలిపారు. మృతుల్లో ఫరా ప్రావిన్షియల్‌ కౌన్సిల్‌ చీఫ్‌ ఫరీద్‌ భక్తావర్‌, 207 జాఫర్‌ మిలిటరీ కార్ప్స్‌ డిప్యూటీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ నెమతుల్లా ఖలీల్‌ కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com