కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్, 25 మంది మృతి
- October 31, 2018
అఫ్గానిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఫరా ప్రావిన్స్లో ఓ సైనిక విమానం కుప్పకూలి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఫరా ప్రావిన్స్లోని అనార్ దరా జిల్లా నుంచి హెరత్ ప్రావెన్స్కు బయల్దేరిన ఓ సైనిక విమానం బుధవారం ఉదయం 9.10 గంటల సమయంలో కూలిపోయింది. అనార్ దరా బేస్ నుంచి విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో విమానంలో '207 జాఫర్ మిలిటరీ కార్ప్స్' అధికారులతో పాటు ఫరా ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యులు మొత్తం 25 మంది ఉన్నారు. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని జాఫర్ మిలిటరీ కార్ప్స్ అధికార ప్రతినిధి నజీబుల్లా నజీబీ తెలిపారు. మృతుల్లో ఫరా ప్రావిన్షియల్ కౌన్సిల్ చీఫ్ ఫరీద్ భక్తావర్, 207 జాఫర్ మిలిటరీ కార్ప్స్ డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ నెమతుల్లా ఖలీల్ కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!