ఇరాన్ లో నిరసన..జైలు పాలైన కార్మికులు
- October 31, 2018టెహ్రాన్: వేతన బకాయిల కోసం ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి జైలులోకి నెట్టటాన్ని ఇరాన్ కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. గత వేసవిలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో కార్మికులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో పాల్గొన్న కార్మికులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెవీ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ కంపెనీ (హెప్కో)కు చెందిన వారని, గత ఏడాది సెప్టెంబర్లో ఈ కంపెనీ ప్రైవేటు పరం కావటంతో వీరంతా తమ వేతన బకాయిల కోసం ఆందోళన చేశారని ఇరాన్ కమ్యూనిస్టు పార్టీ తుడే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నవీద్ షొమాలి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆందోళనలో పాల్గొన్న 15 మంది హెప్కో కార్మికులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయటం అమానుషమని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్దయెత్తున ఐక్యపోరాటాలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఆయన ఇరాన్ కార్మికలోకానికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం