విమానప్రయాణికుడి వద్ద బులెట్ల కలకలం

- November 01, 2018 , by Maagulf
విమానప్రయాణికుడి వద్ద బులెట్ల కలకలం

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద బులెట్లు లభించడం కలకలం రేపింది. హైదరాబాద్‌ నుంచి రియాద్‌ వెళుతోన్న అలీబీన్‌ ఉస్మాన్‌ అనే ప్రయాణికుడి నుంచి CISF సిబ్బంది రెండు బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అలీబీన్‌ ఉస్మాన్‌ గత కొంత కాలంగా రియాద్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవలే మహబూబ్‌నగర్‌కు వచ్చిన ఉస్మాన్‌ తిరిగి ఈ రోజు రియాద్‌ వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అయితే.. ఉస్మాన్‌ లగేజ్‌ బ్యాగ్‌ చెక్‌చేసిన ఎయిర్‌పోర్ట్‌ భద్రతా సిబ్బందికి 10.98 సైజ్‌లో ఉన్నరెండు లైవ్‌ బులెట్లు దొరికాయి. నిందితుడు ఉస్మాన్‌పై ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com