మహేష్ హీరోయిన్ ని పరామర్శించిన నమ్రత
- November 01, 2018
బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే తెలుగులో మహేష్ బాబు సరసన మురారీ సినిమాలో నటించింది. ఆ అభిమానంతోనే క్యాన్సర్తో పోరాడుతూ న్యూయార్క్లో చికిత్స పొందుతున్న సోనాలీని చూడడానికి మహేష్ బాబు భార్య నమ్రత వెళ్లింది. వివాహం చేసుకున్న తరువాత సిల్వర్ స్క్రీన్కు దూరమైన సోనాలీకి ఒక బాబు ఉన్నాడు. గత కొంత కాలంగా హైగ్రేడ్ క్యాన్సర్ బాధపడుతోంది. ఈ విషయాన్ని సోనాలీ జులైలో తనే స్వయంగా ప్రకటించింది.
అప్పటి నుంచి చికిత్స తీసుకుంటోంది. చికిత్సలో భాగంగా కీమో థెరపీ చేయించుకుంటున్న సమయంలో జుట్టంతా రాలిపోతుంది. గుండుతో ఉండాల్సి వచ్చినా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా దాన్ని కూడా సంతోషంగానే స్వీకరించింది. ధైర్యంగా ఉన్నానంటూ అభిమానులకోసం ఆ ఫోటోలను షేర్ చేసింది. ఇప్పటికే ఆమెను బాలీవుడ్ సెలబ్రెటీలు చాలామంది పలకరించారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా సోనాలీని కలిసి వచ్చారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. సోనాలి గురిచి చెబుతూ.. తనకి ధైర్యం చాలా ఎక్కువని, క్యాన్సర్ బారి నుంచి కోలుకుంటోందని అన్నారు.
త్వరలో సాధారణ జీవితం గడపనుంది అని నమ్రత తెలిపింది. ఆమెతో గడిపిన కొద్ది సమయం చాలా సంతోషంగా అనిపించిందని, చాలా విషయాలు చర్చించుకున్నామని వివరించింది. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తానని తెలిపింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి