మళ్లీ కేరళలో టెన్షన్ వాతావరణం...
- November 04, 2018కేరళ : మళ్లీ టెన్షన్...టెన్షన్...అయ్యప్పను దర్శించుకుంటామని మహిళలు..అడ్డుకుంటామని ఇతరుల హెచ్చరింపులు..దీనితో మరోసారి కేరళ రాష్ట్రంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల్ని అనుమతించాల్సిందేనని.. అనుమతించకపోవటం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును పలువురు వ్యతిరేకించారు. ఇటీవలే తెరిచిన ఆలయం వద్దకు అయ్యప్పను దర్శించుకొనేందుకు వచ్చిన మహిళలు ఆందోళనకారులు అడ్డుకున్నారు. తెరిచిన రోజుల్లో ఏ ఒక్క మహిళ దర్శనం చేసుకోలేదు. తాజాగా సోమవారం ఆలయం తెరుచుకోనుంది.
దీనితో అక్కడి రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. నీలక్కల్ నుండి పంబా వరకు పలు ఆంక్షలు విధించారు. మహిళలు రాకుండా హిందూ సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. శబరిమల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. దాదాపు రెండు వేల మంది పోలీసులు మోహరించడంతో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కేవలం 9గంటల పాటు ఆలయాన్ని తెరచి ఉంచనున్నారు. స్వామిని దర్శించుకునేందుకు 10 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారు ఇప్పటికే శబరిమలకు బయలుదేరినట్లు సమాచారం.
ఈ సందర్భంగా పోలీసులు పలు ఆదేశాలు జారీ చేశారు. భక్తులు గుమికూడి ఉండవద్దని హెచ్చరించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కాప్స్ హెచ్చరించారు. ఇందులో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ