ఇటలీలో భీకర తుఫాన్
- November 04, 2018
మిలాన్/రోమ్: ఇటలీలో సంభవించిన భీకర తుఫాన్ వల్ల భారీగా వర్షాలు కురిసి వరద పెరుగడంతో 17 మంది మరణించారు. దాదాపు 1.4 కోట్ల చెట్లు నేలమట్టమయ్యాయి. ఈదురుగాలులు గంటకు 180 కి.మీ. వేగంతో వీస్తున్నాయి. చెట్లు విరిగి మీద పడటంతోనే ఎక్కువ మంది మరణించారు. సిసిలీ, ట్రెన్టినో, వెనిటో రాష్ర్టాలను తుఫాన్ కుదిపేసింది. భారీగా కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. అధికారులు మాట్లాడుతూ తుఫాన్ ధాటికి భారీగా విధ్వంసం జరిగిందని, తిరిగి కోలుకోవడానికి దాదాపు 100 ఏండ్లు పట్టవచ్చని చెప్పారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఉన్నారని తెలిపారు. వరద పెరుగడంతో పాఠశాలలను మూసివేశామని పేర్కొన్నారు. తుఫాన్ ప్రధానంగా ఇటలీ ఉత్తర ప్రాంతం, వెనిస్ చుట్టుపక్కల ప్రభావం చూపిందని, దీంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









