పండక్కి పతంజలి జీన్స్.. 25% డిస్కౌంట్..
- November 05, 2018
ఈ దీపావళి పండుగను పతంజలి వస్త్రాలు ధరించి మరింత ఆనందంగా జరుపుకోమంటూ మార్కెట్లోకి తీసుకు వచ్చారు బాబా రాందేవ్. ఢిల్లీలో పతంజలి పరిధాన్ పేరిట యాక్సెసరీస్ స్టోర్ను సోమవారం ప్రారంభించారు. స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ వస్త్రాలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని స్టోర్లు ఏర్పాటు చేసి అందరికి అందుబాటులోకి తీసుకువస్తామంటున్నారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్ స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. మహిళలు, పురుషులు, చిన్నారుల అభిరుచులకు తగ్గట్లు ఇక్కడ దుస్తులు లభ్యమవుతాయి. ఇంకా పండగ సీజన్ని పురస్కరించుకుని 25 శాతం డిస్కౌంట్తో దుస్తులు విక్రయిస్తున్నట్లు తెలిపారు. జీన్స్ రూ.500, బ్రాండెడ్ షర్ట్ రూ.500 కే ఇస్తున్నట్లు తెలిపారు. 7వేల రూపాయల విలువ చేసే వస్త్రాలను రూ.1100లకే ఇస్తున్నట్లు తెలియజేశారు. పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలను నియంత్రించి స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించే దిశగా పతంజలి పరిధాన్ను తీసుకు వచ్చామని రాందేవ్ అంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!