భాగ్యనగరంలో ఆ రెండు గంటల్లోనే టపాసులు పేల్చాలి
- November 06, 2018
హైదరాబాద్:దీపావళి రోజున టపాకాయిలు పేల్చడంపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. కేవలం రెండు గంటలు మాత్రమే పేల్చాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాణాసంచా, పటాకులను కాల్చడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో భారీ శబ్దాలను కలగజేసే టపాసులను పేల్చడాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. నగరవాసులు సుప్రీం ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. దీపావళి పండుగ రోజు రాత్రి 8గంటల నుండి 10గంటలలోపు మాత్రమే టపాసులను కాల్చాలని దానకిషోర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









