అంతరిక్షంలోకి మరో యూఏఈ శాటిలైట్!
- November 07, 2018మైశాట్-1 పేరుతో యూఏఈకి చెందిన స్టూడెంట్స్ తయారు చేసిన నానో శాటిలైట్ ఈ నెలలోనే అంతరిక్షంలోకి వెళ్ళనుంది. గత నెలలో అంటే అక్టోబర్లో 29వ తేదీన దేశానికి చెందిన ఖలీఫా శాటిలైట్, జపాన్లోని ప్రయోగ కేంద్రం నుంచి ఆకాంశంలోకి దూసుకెళ్ళిన సంగతి తెల్సిందే. కాగా, 20 మంది విద్యార్థులు, మైశాట్-1 శాటిలైట్ని రూపొందించారు. ఖలీఫా యూనివర్సిటీకి చెందిన ఈ విద్యార్థులు తయారు చేసిన శాటిలైట్, భూమిని ఫొటోలు తీయనుంది. ప్రధానంగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం దీన్ని రూపొందించారు. నార్త్ట్రాప్ గ్రుమ్నాన్ సంస్థ తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మైశాట్-1 ఉపగ్రహాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపిస్తారు. మైశాట్-1 బరువు 1.3 కిలోలు. మస్దార్ సిటీలోని యహ్శాట్ స్పేస్ ల్యాబ్లో దీన్ని రూపొందించారు. మస్దార్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసిన బ్యాటరీతోపాటు, కెమెరా ఇందులోని ప్రధాన భాగాలు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ