దీపావళికి టపాసులు ఎందుకు కాల్చుతారో తెలుసా..!
- November 07, 2018
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా వెలుగుల పండుగ చేసుకుంటున్నారు. చెడును అంతం చేసి మంచిని గెలిపించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అసలు దీపావళి ఎన్ని రోజులు చేసుకోవాలి? ఏ పండగకు లేని విశిష్టత దీపావళికే ఎందుకు? టపాసులు కాల్చాలన్న సంప్రదాయం ఎలా వచ్చింది?
హిందువుల ప్రముఖ పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది. దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య నాడు వస్తుంది. అంతకుముందు రోజు నరక చతుర్దశి. వ్యాపారులు దీపావళి పర్వదినాన్ని నూతన సంవత్సరంగా భావిస్తారు. లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు.
నిజానికి దీపావళి మూడు రోజుల పండుగ. కొన్నిచోట్ల ఈ పండుగను ఐదురోజులు కూడా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఈ పండుగ మొదటిరోజు నరకచతుర్దశి, రెండోరోజు దీపావళి, మూడోరోజు బలిపాడ్యమిగా జరుపుకుంటారు. ఐదురోజులు పండుగ చేసుకునే వారు ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ జరుపుకుంటారు. జ్ఞానానికి, ఐశ్వర్యానికి, ఆనందానికి ప్రతీకగా నిలిచే జ్యోతి మహాలక్ష్మి స్వరూపం. అలాంటి దీపావళినాడు జ్యోతిని లక్ష్మీదేవిలా భావించి మహిళలు లక్ష్మీపూజ నిర్వహిస్తారు.
శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని చంపిన తర్వాతి రోజు, ఆ రాక్షసుని పీడ విరగడైందన్న సంతోషంతో దీపావళి జరుపుకునే సంప్రదాయం వచ్చింది. శ్రీరాముడు, రావణాసురుని అంతం చేసి… సీతమ్మను తీసుకుని అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకునే ఆచారం వచ్చిందని కూడా చెప్తుంటారు. మొత్తానికి చెడును రూపుమాపి… మంచిని మిగిల్చిన సందర్భంగా చీకటిని పారదోలుతూ దీపాలను వెలిగించి… విజయసూచకంగా టపాసులు మోగించే ఆచారం ఏర్పడింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







