ఎన్ ఎస్ జి కమాండర్ గా ఆది..
- November 08, 2018
ప్రముఖ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. 'ఆపరేషన్ గోల్డ్ఫిష్' రూపొందే ఈ మూవీకి 'వినాయకుడు' ఫేమ్ అడివి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎయిర్టెల్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా పాపులర్ అయిన సాషా ఛెత్రి ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతోంది. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. పోస్టర్లో ఎన్ ఎస్ జీ కమాండోగా ఆది సాయికుమార్ లుక్ కొత్తగా ఉంది.. ఈ చిత్రంలో ఎన్ ఎస్ జి కమాండో అర్జున్ పండిట్గా ఆది కనిపిస్తారు. నిత్య నరేష్, కార్తీక్ రాజు, పార్వతీశం, అబ్బూరి రవి, క్రిష్ణుడు, రావు రమేశ్ ముఖ్య పాత్రలు పోషించారు. వినాయకుడు టాకీస్ బ్యానర్పై ప్రతిభ అడివి, కట్ట ఆశీష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీశ్ డేగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా.. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
. గూఢచారి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఊపిరి, క్షణం, కేరింత, ఎవడు వంటి చాలా చిత్రాలకు మాటలు సమకూర్చిన అబ్బూరి రవి ఈ మూవీ ద్వారా నటుడిగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







