దుబాయ్ చేరుకున్న కొత్త మెట్రో రైళ్ళు
- November 10, 2018
దుబాయ్:కొత్త మెట్రో రైళ్ళకు సంబంధించి తొలి దఫాలో 50 రైళ్ళు దుబాయ్ చేరుకున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఈ రైళ్ళను రషిదియా మెట్రో డిపోకి తరలించారు. 2019 అక్టోబర్ నాటికి మొత్తం రైళ్ళన్నీ దుబాయ్కి చేరుకుంటాయని ఆర్టిఎ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్ చెప్పారు. రెడ్ లైన్ రూట్ 2020లో త్వరలో ఈ రైళ్ళను పరీక్షించబోతఱున్నారు. ప్రస్తుతం 643 మంది ప్రయాణీకులకు వీలుగా రైళ్ళ డిజైన్లు వుండగా, కొత్త రైళ్ళలో 696 మంది ప్రయాణీకులకు వీలుంటుంది. ఎక్స్టీరియర్ డిజైన్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. కొత్త ట్రైన్లలో చివరి క్యారేజ్ మహిళలు, పిల్లల కోసం వినియోగిస్తారు. ఫస్ట్ క్యారేజ్ గోల్డ్ క్లాస్లో వుంటుంది. మిగతా క్యారేజెస్ అన్నీ సిల్వర్ క్లాస్గా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







