న్యూజిలాండ్ పై 34 పరుగులతో భారత్ మహిళా జట్టు సంచలన విజయం
- November 10, 2018
కరీబియన్ ద్వీపాలు వేదికగా ప్రారంభమైన మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్ -బీ లీగ్ లో 5వ ర్యాంకర్ భారత్ సంచలన విజయంతో టైటిల్ వేట మొదలుపెట్టింది.
గయానా నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన గ్రూప్ తొలిమ్యాచ్ లో భారత్ 34 పరుగులతో రెండోర్యాంకర్ న్యూజిలాండ్ ను చిత్తు చేసింది.
ఈమ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్.20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.51 బాల్స్ లో 7 బౌండ్రీలు, 8 సిక్సర్లతో సుడిగాలి సెంచరీ సాధించింది. యువప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ 45 బాల్స్ లోనే 7 బౌండ్రీలతో 59 పరుగుల స్కోరు నమోదు చేసింది.
సమాధానంగా 195 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్.20 ఓవర్లలో 9 వికెట్లకు 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి