ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
- November 13, 2018
దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ వర్గాన్ని మచ్చిక చేసుకునే వ్యూహాలు రచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆకట్టుకునే ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఓ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. సాధారణంగా ప్రభుత్వ సంస్థల్లో కానీ ప్రయివేటు సంస్థల్లో కానీ పని చేసే ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకొకసారి నిర్దేశిత భత్యాన్ని గ్రాట్యుటీగా పొందే అవకాశం ఉండేది ఇప్పటి వరకు.
అయితే ఈ అవకాశం సంస్థలు ఉద్యోగులందరికీ కల్పించడం లేదన్నది వాస్తవం. సుదీర్ఘకాలం సర్వీసులో ఉన్నవారికి మాత్రమే లబ్ది చేకూరుతున్నదని ఉద్యోగ సంఘాలనుంచి నిరసన వ్యక్తమవుతోంది. అయితే ఇదే అవకాశంగా భావించిన మోదీ సర్కార్.. గ్రాట్యుటీ పీరియడ్ని మూడేళ్లకు కుదించేలా.. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ-1972 చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తోంది. కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్న ఉద్యోగులకు కూడా ఈ తాజా సడలింపు వర్తించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పారిశ్రామిక వర్గాల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తోంది లేబర్ మినిస్ట్రీ. డిసెంబర్ నెలాఖరుకు ఈ నిర్ణయం పట్ల స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







