ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
- November 13, 2018దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ వర్గాన్ని మచ్చిక చేసుకునే వ్యూహాలు రచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆకట్టుకునే ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఓ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. సాధారణంగా ప్రభుత్వ సంస్థల్లో కానీ ప్రయివేటు సంస్థల్లో కానీ పని చేసే ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకొకసారి నిర్దేశిత భత్యాన్ని గ్రాట్యుటీగా పొందే అవకాశం ఉండేది ఇప్పటి వరకు.
అయితే ఈ అవకాశం సంస్థలు ఉద్యోగులందరికీ కల్పించడం లేదన్నది వాస్తవం. సుదీర్ఘకాలం సర్వీసులో ఉన్నవారికి మాత్రమే లబ్ది చేకూరుతున్నదని ఉద్యోగ సంఘాలనుంచి నిరసన వ్యక్తమవుతోంది. అయితే ఇదే అవకాశంగా భావించిన మోదీ సర్కార్.. గ్రాట్యుటీ పీరియడ్ని మూడేళ్లకు కుదించేలా.. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ-1972 చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తోంది. కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్న ఉద్యోగులకు కూడా ఈ తాజా సడలింపు వర్తించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పారిశ్రామిక వర్గాల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తోంది లేబర్ మినిస్ట్రీ. డిసెంబర్ నెలాఖరుకు ఈ నిర్ణయం పట్ల స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు