అమెరికా:భీకరమైన మంటలు.. 42 మంది మృతి..
- November 13, 2018
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో ఏర్పడిన కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. భీకరమైన మంటల కారణంగా ఇప్పటివరకు 42 మంది మరణించారు. వందలాదామంది గాయపడ్డారు. అయితే కాలిఫోర్నియా చరిత్రలోనే ఈ ప్రమాదం అతిపెద్దదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 6వేల 5వందల నివాస ప్రాంతాలు బుగ్గిపాలయ్యాయి. దాదాపు 90వేల ఎకరాల భూమి కాలిబూడిదైంది.
మంటలను అదుపుచేసేందుకు 8వేల మంది నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 50వేల నివాస ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉందని, దాదాపు రెండులక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఎగిసిపడుతున్న మంటల కారణంగా ఎక్కడ చూసినా భయానక వాతావరణమే కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు







