ఇస్రో బాహుబలి ప్రయోగం విజయవంతం
- November 14, 2018
ఇస్రో బాహుబలి ప్రయోగం విజయవంతమైంది. సమాచార వ్యవస్థకు ఊతమిచ్చే జీశాట్-29 భారీ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-మార్క్3 డీ2 రాకెట్ రోదసిలోకి తీసుకువెళ్లింది. రాకెట్ బరువు 640 టన్నులు కాగా, ఉపగ్రహం బరువు 3,423 కిలోలు. శ్రీహరికోట షార్లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ రాకెట్ను నింగిలోకి పంపారు శాస్త్ర వేత్తలు. 16.43 నిమిషాలలో భూమికి 207కి.మీ. ఎత్తుకు చేరుకుని జీశాట్-29 ఉపగ్రహాన్ని వదిలిపెట్టింది రాకెట్. దీంతో ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా ఈ ఉపగ్రహం.. జమ్ము-కశ్మీర్, ఉత్తర, ఈశాన్య భారత భూ భాగాలలో సేవలు అందించనుంది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ ప్రసారాలకు ఊతం ఇస్తుంది. మొత్తం పదేళ్లపాటు ఈ ఉపగ్రహం పనిచేసేలా రూపొందించారు శాస్త్రవేత్తలు. బెంగుళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్, అహ్మదాబాదులోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా ఉపగ్రహాన్ని రూపొందించాయి.
తాజా వార్తలు
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..
- ఉక్రెయిన్ ప్రధానిగా కోరెట్స్కీ...
- భారత్ పై రెండో వన్డేలో విజయం..
- ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..







