దీప్వీర్ పెళ్లి ఫొటోల కోసం వేచి చూస్తే అస్థి పంజరం అవుతారు!
- November 15, 2018
బాలీవుడ్ ప్రేమజంట దీపికా పదుకొనె - రణ్వీర్ సింగ్ వివాహం ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగింది. మొదట నిశ్చితార్థ వేడుక అనంతరం వివాహం జరిగింది. వరుడు రణ్వీర్ సీప్లేన్లో మండపానికి వచ్చాడు. దీపిక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన చీరను ధరించిందనట్టు తెలిసింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్లకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో దీప్ రణ్ పెళ్లి ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా ఈ వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఆ విషయం తెలియజేస్తూ.. ఆసక్తికరమైన ట్విట్ చేశారు స్మృతీ. 'దీప్వీర్ పెళ్లి ఫొటోల కోసం చాలా సేపటి వరకు ఎదురుచూసినప్పుడు ఇలాగే ఉంటుంది' అంటూ ఓ బల్లపై కూర్చున్న అస్తిపంజరం ఫోటోను పోస్టు చేశారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుభమా అని పెళ్లి చేసుకొంటుంటే.. ఈ అస్థిపంజరం ఏంటీ మంత్రి గారూ.. !! అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!