కువైట్లో వర్షాలు: యూఏఈ నుంచి విమానాల రద్దు
- November 15, 2018
యూఏఈకి చెందిన అన్ని ఎయిర్ లైన్స్, తమ విమానాల్ని కువైట్కి వెళ్ళకుండా నిలువరించాయి. కువైట్లో వున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిజిసిఎ పేర్కొంది. కువైట్లో భారీ వర్షాలు, వరదలతో జన జీవనం అస్తవ్యస్తమవుతోంది. విమానాశ్రయాల్లోనూ వరద నీరు పోటెత్తుతోంది. దుబాయ్, అబుదాబీ సహా అనేక విమానాశ్రయాలనుంచి విమానాల్ని కువైట్కి నిలిపివేశారు. కువైట్లో స్కూళ్ళు సైతం మూతపడ్డాయి. గత ఐదు రోజులుగా అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. మరోపక్క కువైట్లో యూఏఈ ఎంబసీ, తమ పౌరుల్ని అప్రమత్తం చేసింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్ళరాదని పౌరుల్ని హెచ్చరించింది. కాగా, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్, తమ కంపెనీల్లో వర్క్ని తాత్కాలికంగా నిలిపివేసింది. కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ కూడా వర్క్ని నిలిపివేయడం గమనార్హం. అనూహ్యంగా చోటు చేసుకున్న వరదలతో కువైట్లో పరిస్థితులు బీతావహంగా మారాయి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







