అతి తక్కువ ధరకే విమాన టికెట్..
- November 16, 2018గో ఎయిర్ సంస్థ ప్రారంభించి 13 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా కేవలం రూ.1,313కే విమానంలో ప్రయాణించవచ్చని తెలిపింది. ఈనెల 5 నుంచి 18 వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయని.. ఈలోపు కొనుగోలు చేసిన వారికీ వచ్చే ఏడాది నవంబర్ 4వ తేదీ లోపు విమాన ప్రయాణం చేవచ్చని గోఎయిర్ సీఈఓ కార్నిలిస్ వీస్జివిక్ వెల్లడించారు. 2005, నవంబర్లో కార్యకలాపాలు ప్రారం భించామని, విమాన సర్వీస్లను ఆరంభించి 13 సంవత్సరాలైన సందర్భంగా 13 లక్షల సీట్లను ఈ ఆఫర్లో అందిస్తున్నామని వివరించారు. ఇదిలావుంటే జెట్ఎయిర్వేస్ సంస్థ దివాలీ ఆఫర్ను ఈ నెల 11 వరకూ పొడిగించింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!