ఫ్లూ: విద్యార్థి మరణంతో అలర్ట్
- November 16, 2018
దుబాయ్కి చెందిన విద్యార్థి అలియా నియాజ్ అలి అనుమానాస్పద ఫ్లూ సమస్యలతో మృతి చెందడంతో, పలు స్కూళ్ళు హెల్త్ అలర్ట్ని జారీ చేశాయి. విద్యార్థులకు ఏమాత్రం నలత వున్నా తల్లిదండ్రులు వారిని ఇంటి వద్దనే వుంచాలని ఈ అలర్ట్లో విద్యా సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే అలియాకి వైద్య చికిత్స అందించిన రషీద్ హాస్పిటల్ వైద్య సిబ్బంది మాత్రం, ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా పేర్కొంది. 17 ఏళ్ళ అలియా, ఇండియన్ హైస్కూల్లో విద్యనభ్యసించడం జరిగింది. ఫ్లూ తరహా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అలియాకి, తొలుత ప్రైవేటు క్లినిక్లో వైద్య చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎమర్జన్సీ కండిషన్లో రషీద్ హాస్పిటల్కి తరలించారు. అక్కడామెకు వైద్య చికిత్స ప్రారంభించినా, ఆమె ప్రాణాల్ని కాపాడలేకపోయారు వైద్యులు. విద్యార్థి మృతి పట్ల తాము ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రషీద్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







