ఫ్లూ: విద్యార్థి మరణంతో అలర్ట్
- November 16, 2018
దుబాయ్కి చెందిన విద్యార్థి అలియా నియాజ్ అలి అనుమానాస్పద ఫ్లూ సమస్యలతో మృతి చెందడంతో, పలు స్కూళ్ళు హెల్త్ అలర్ట్ని జారీ చేశాయి. విద్యార్థులకు ఏమాత్రం నలత వున్నా తల్లిదండ్రులు వారిని ఇంటి వద్దనే వుంచాలని ఈ అలర్ట్లో విద్యా సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే అలియాకి వైద్య చికిత్స అందించిన రషీద్ హాస్పిటల్ వైద్య సిబ్బంది మాత్రం, ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా పేర్కొంది. 17 ఏళ్ళ అలియా, ఇండియన్ హైస్కూల్లో విద్యనభ్యసించడం జరిగింది. ఫ్లూ తరహా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అలియాకి, తొలుత ప్రైవేటు క్లినిక్లో వైద్య చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎమర్జన్సీ కండిషన్లో రషీద్ హాస్పిటల్కి తరలించారు. అక్కడామెకు వైద్య చికిత్స ప్రారంభించినా, ఆమె ప్రాణాల్ని కాపాడలేకపోయారు వైద్యులు. విద్యార్థి మృతి పట్ల తాము ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రషీద్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









