ఫ్లూ: విద్యార్థి మరణంతో అలర్ట్
- November 16, 2018దుబాయ్కి చెందిన విద్యార్థి అలియా నియాజ్ అలి అనుమానాస్పద ఫ్లూ సమస్యలతో మృతి చెందడంతో, పలు స్కూళ్ళు హెల్త్ అలర్ట్ని జారీ చేశాయి. విద్యార్థులకు ఏమాత్రం నలత వున్నా తల్లిదండ్రులు వారిని ఇంటి వద్దనే వుంచాలని ఈ అలర్ట్లో విద్యా సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే అలియాకి వైద్య చికిత్స అందించిన రషీద్ హాస్పిటల్ వైద్య సిబ్బంది మాత్రం, ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా పేర్కొంది. 17 ఏళ్ళ అలియా, ఇండియన్ హైస్కూల్లో విద్యనభ్యసించడం జరిగింది. ఫ్లూ తరహా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అలియాకి, తొలుత ప్రైవేటు క్లినిక్లో వైద్య చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎమర్జన్సీ కండిషన్లో రషీద్ హాస్పిటల్కి తరలించారు. అక్కడామెకు వైద్య చికిత్స ప్రారంభించినా, ఆమె ప్రాణాల్ని కాపాడలేకపోయారు వైద్యులు. విద్యార్థి మృతి పట్ల తాము ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రషీద్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?