ఫ్లూ: విద్యార్థి మరణంతో అలర్ట్
- November 16, 2018
దుబాయ్కి చెందిన విద్యార్థి అలియా నియాజ్ అలి అనుమానాస్పద ఫ్లూ సమస్యలతో మృతి చెందడంతో, పలు స్కూళ్ళు హెల్త్ అలర్ట్ని జారీ చేశాయి. విద్యార్థులకు ఏమాత్రం నలత వున్నా తల్లిదండ్రులు వారిని ఇంటి వద్దనే వుంచాలని ఈ అలర్ట్లో విద్యా సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే అలియాకి వైద్య చికిత్స అందించిన రషీద్ హాస్పిటల్ వైద్య సిబ్బంది మాత్రం, ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా పేర్కొంది. 17 ఏళ్ళ అలియా, ఇండియన్ హైస్కూల్లో విద్యనభ్యసించడం జరిగింది. ఫ్లూ తరహా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అలియాకి, తొలుత ప్రైవేటు క్లినిక్లో వైద్య చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎమర్జన్సీ కండిషన్లో రషీద్ హాస్పిటల్కి తరలించారు. అక్కడామెకు వైద్య చికిత్స ప్రారంభించినా, ఆమె ప్రాణాల్ని కాపాడలేకపోయారు వైద్యులు. విద్యార్థి మృతి పట్ల తాము ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రషీద్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







