కువైట్లో వరద బీభత్సం: విమానాల రద్దు, స్కూళ్ళ మూసివేత
- November 16, 2018
కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. కువైట్ క్యాపిటల్ని ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో స్కూళ్ళను సైతం తాత్కాలికంగా మూసివేశారు. భారీగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి భీతావహంగా మారిందనీ, ప్రాణ నష్టం తగ్గించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన విమానాల్ని, దుబాయ్, బహ్రెయిన్ దమ్మమ్ విమానాశ్రయాలకు మళ్ళిస్తున్నట్లు కువైట్ సివిల్ ఏవియేషన్ హెడ్ షేక్ సల్మాన్ అల్సబా చెప్పారు. మరో రెండు రోజులపాటు ఇవే పరిస్థితులు కువైట్లో కొనసాగే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటోంది. కేవలం రెండు రోజుల్లోనే 96 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇది దేశానికి సంబంధించి వార్షిక వర్షపాతం. పబ్లిక్ ఆఫీసులు సైతం వర్షాలు, వరదల కారణంగా మూతపడ్డాయి. కువైట్ బోర్డర్లో అల్ హఫర్ అల్ బాతిన్ వద్ద 46 మందితో వెళుతున్న బస్సుని గుర్తించి, అందులోనివారిని రక్షించినట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







