కువైట్లో వరద బీభత్సం: విమానాల రద్దు, స్కూళ్ళ మూసివేత
- November 16, 2018
కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. కువైట్ క్యాపిటల్ని ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో స్కూళ్ళను సైతం తాత్కాలికంగా మూసివేశారు. భారీగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి భీతావహంగా మారిందనీ, ప్రాణ నష్టం తగ్గించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన విమానాల్ని, దుబాయ్, బహ్రెయిన్ దమ్మమ్ విమానాశ్రయాలకు మళ్ళిస్తున్నట్లు కువైట్ సివిల్ ఏవియేషన్ హెడ్ షేక్ సల్మాన్ అల్సబా చెప్పారు. మరో రెండు రోజులపాటు ఇవే పరిస్థితులు కువైట్లో కొనసాగే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటోంది. కేవలం రెండు రోజుల్లోనే 96 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇది దేశానికి సంబంధించి వార్షిక వర్షపాతం. పబ్లిక్ ఆఫీసులు సైతం వర్షాలు, వరదల కారణంగా మూతపడ్డాయి. కువైట్ బోర్డర్లో అల్ హఫర్ అల్ బాతిన్ వద్ద 46 మందితో వెళుతున్న బస్సుని గుర్తించి, అందులోనివారిని రక్షించినట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









