హరారే:బస్సులో గ్యాస్ ట్యాంక్ పేలి 42 మంది మృతి
- November 16, 2018
హరారే: జింబాబ్వేలో ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో దాదాపు 42 మంది మరణించారు. 20 మంది తీవ్ర గాయాలపాలైనట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు. బస్సులో ఉన్న గ్యాస్ ట్యాంక్ పేలడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఆ దేశ రాజధాని హరారేకు 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాండా ప్రాంతంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం ప్రకారం 42 మంది ప్రయాణికులు మరణించారు అని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఆ గ్యాస్ ట్యాంక్ ప్రయాణికుల్లో ఒకరిదిగా భావిస్తున్నారు. జింబాబ్వే రెడ్ క్రాస్ ట్విటర్లో పెట్టిన ఫొటోల్లో బస్సు పూర్తిగా కాలిపోయి కనిపిస్తుంది. ఈ నెల మొదట్లో హరారే, రుసపే హైవే మీద రెండు బస్సులు ఢీకొనడంతో 47 మంది దుర్మరణం పాలయ్యారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్