హరారే:బస్సులో గ్యాస్ ట్యాంక్ పేలి 42 మంది మృతి
- November 16, 2018
హరారే: జింబాబ్వేలో ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో దాదాపు 42 మంది మరణించారు. 20 మంది తీవ్ర గాయాలపాలైనట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు. బస్సులో ఉన్న గ్యాస్ ట్యాంక్ పేలడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఆ దేశ రాజధాని హరారేకు 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాండా ప్రాంతంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం ప్రకారం 42 మంది ప్రయాణికులు మరణించారు అని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఆ గ్యాస్ ట్యాంక్ ప్రయాణికుల్లో ఒకరిదిగా భావిస్తున్నారు. జింబాబ్వే రెడ్ క్రాస్ ట్విటర్లో పెట్టిన ఫొటోల్లో బస్సు పూర్తిగా కాలిపోయి కనిపిస్తుంది. ఈ నెల మొదట్లో హరారే, రుసపే హైవే మీద రెండు బస్సులు ఢీకొనడంతో 47 మంది దుర్మరణం పాలయ్యారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







