హరారే:బస్సులో గ్యాస్ ట్యాంక్ పేలి 42 మంది మృతి
- November 16, 2018
హరారే: జింబాబ్వేలో ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో దాదాపు 42 మంది మరణించారు. 20 మంది తీవ్ర గాయాలపాలైనట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు. బస్సులో ఉన్న గ్యాస్ ట్యాంక్ పేలడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఆ దేశ రాజధాని హరారేకు 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాండా ప్రాంతంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం ప్రకారం 42 మంది ప్రయాణికులు మరణించారు అని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఆ గ్యాస్ ట్యాంక్ ప్రయాణికుల్లో ఒకరిదిగా భావిస్తున్నారు. జింబాబ్వే రెడ్ క్రాస్ ట్విటర్లో పెట్టిన ఫొటోల్లో బస్సు పూర్తిగా కాలిపోయి కనిపిస్తుంది. ఈ నెల మొదట్లో హరారే, రుసపే హైవే మీద రెండు బస్సులు ఢీకొనడంతో 47 మంది దుర్మరణం పాలయ్యారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







