తెలంగాణ:కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
- November 17, 2018హైదరాబాద్: 13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. అధిష్ఠానం ఆమోద ముద్ర అనంతరం ఈ జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీ విషయంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత సందిగ్ధత వీడిన విషయం తెలిసిందే. ఆయన జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆ పార్టీ రాష్ర్ట వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. కోదండరాం పెద్ద మనుసు చేసుకుని ఆ స్థానాన్ని కాంగ్రెస్కు ఇచ్చారని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి 12 తర్వాత కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయంలో భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పొన్నాల లక్ష్మయ్య సహా 13 మందితో కాంగ్రెస్ తాజా జాబితాను విడుదల చేసింది.
అభ్యర్థుల వివరాలు..
భోథ్(ఎస్టీ)- సోయం బాపురావు
నిజామాబాద్ అర్బన్-తాహెర్ బిన్ హమ్దాన్
నిజామాబాద్ రూరల్ - డా. రేకుల భూపతి రెడ్డి
బాల్కొండ- ఈ. అనిల్కుమార్
ఎల్బీనగర్ -డి. సుధీర్రెడ్డి
కార్వాన్-ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజారి
యాకత్పురా- కె. రాజేందర్ రాజు
బహదూర్పుర - కలేం బాబా
కొల్లాపూర్ - బీరం హర్షవర్ధన్రెడ్డి
దేవరకొండ(ఎస్టీ)- బాలునాయక్
తుంగతుర్తి(ఎస్సీ)-అద్దంకి దయాకర్
జనగామ - పొన్నాల లక్ష్మయ్య
ఇల్లందు(ఎస్టీ)- బానోత్ హరిప్రియ నాయక్
తాజా జాబితాతో ఇప్పటివరకూ మొత్తం 88 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసే అవకాశం ఉంది. మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ మొత్తం 94 స్థానాల్లో పోటీ చేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్