లోయలో పడిన బస్సు.. 12 మంది ప్రాణాలు..

- November 19, 2018 , by Maagulf
లోయలో పడిన బస్సు.. 12 మంది ప్రాణాలు..

ఉత్తరాఖండ్‌లో  ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తరకాశి జిల్లాలోని వికాస్ నగర్ నుంచి జంకిచట్టికి ప్రయాణీకులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు 150 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడింది. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. గాయపడినవారిని హెలికాప్టర్‌లో డెహ్రాడూన్‌లోని హాస్పిటల్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తగిన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com