లోయలో పడిన బస్సు.. 12 మంది ప్రాణాలు..
- November 19, 2018
ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తరకాశి జిల్లాలోని వికాస్ నగర్ నుంచి జంకిచట్టికి ప్రయాణీకులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు 150 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడింది. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. గాయపడినవారిని హెలికాప్టర్లో డెహ్రాడూన్లోని హాస్పిటల్కు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తగిన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







