లోయలో పడిన బస్సు.. 12 మంది ప్రాణాలు..
- November 19, 2018
ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తరకాశి జిల్లాలోని వికాస్ నగర్ నుంచి జంకిచట్టికి ప్రయాణీకులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు 150 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడింది. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. గాయపడినవారిని హెలికాప్టర్లో డెహ్రాడూన్లోని హాస్పిటల్కు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తగిన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి