లోయలో పడిన బస్సు.. 12 మంది ప్రాణాలు..
- November 19, 2018
ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తరకాశి జిల్లాలోని వికాస్ నగర్ నుంచి జంకిచట్టికి ప్రయాణీకులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు 150 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడింది. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. గాయపడినవారిని హెలికాప్టర్లో డెహ్రాడూన్లోని హాస్పిటల్కు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తగిన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







