హజ్‌ యాత్రకు గడువు పెంపు

- November 19, 2018 , by Maagulf
హజ్‌ యాత్రకు గడువు పెంపు

హైదరాబాద్‌: హజ్‌ యాత్రకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచింది. కేంద్ర హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో హజ్‌ యాంత్రకు వెళ్లాలనుకున్న వారు డిసెంబర్‌ 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని కేంద్ర హజ్‌ కమిటీ సీఈవో మక్సూద్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు. వచ్చే ఏడాది హజ్‌ యాత్రకు వెళ్లేందుకు గడువు శనివారంతో ముగిసిందని, వివిధ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఈ గడువును పొడిగించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పాస్‌పోర్టుఉ డిసెంబర్‌ 18వ తేదీ లోపు జారీ చేసి ఉండాలని, గడువు 2020 జనవరి 31వ తేదీ వరకూ ఉండాలని స్పష్టం చేశారు. హాజీల ఎంపిక డిసెంబర్‌ చివరి వారంలో లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com