తెలుగు కళా సమితి 20వ వార్షిక వేడుకలు
- November 19, 2018
బహ్రెయిన్ తెలుగు కళా సమితి, 20వ వార్షిక ఉత్సవాలకు రంగం సిద్ధమయ్యింది. నవంబర్ 23న ఏసియన్ స్కూల్ - ఎపిజె అబ్దుల్ కలాం ఆడిటోరియం ఇందుకు వేదిక కానుంది. 'రంగస్థలం - ఆట పాట' పేరుతో ఈ మెగా షోని డిజైన్ చేశారు. భారతదేశం నుంచి పలువురు కళాకారులు, ఈ వేదికపై సందడి చేస్తారు. 2,500 మందికి పైగా తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సింగర్స్ మల్లికార్జున్, దామిని భట్ల, బిగ్బాస్ 2 తెలుగు ఫేం భానుశ్రీ, ఢీ డాన్స్ షో యశ్వంత్ ఈ డాన్స్ ఈవెంట్లో సందడి చేస్తారు. టికెఎస్ జనరల్ సెక్రెటరీ, ఈవెంట్ జనరల్ కన్వీనర్ ఎంబీ రెడ్డి మాట్లాడుతూ, ఈ షోని సూపర్ సక్సెస్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. టిక్కెట్స్, మెంబర్ పాస్ల కోసం గంగా సాయిని 36063322 నెంబర్లోనూ, అనిల్ పామిడిని 38829360 నెంబర్లోనూ సంప్రదించవచ్చు.
- ఎం.వాసుదేవ రావు, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!