ఇండియా:ఇంజిన్ లేని ట్రైన్.. ట్రైయిల్ రన్ సక్సెస్..
- November 19, 2018ఇండియా:పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇంజిన్ రహిత రైలును ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ట్రైన్-18గా పేర్కొనే ఈరైలు మొరాదాబాద్-రాంపూర్ మధ్య పరుగులు పెట్టింది. వివిధ స్థాయిల్లో రైలు వేగాన్ని, ట్రైన్ బ్రేక్ల పనితీరును పరిశీలించారు. ఈ రైలును మొదట మొరాదాబాద్-బరేలి మధ్య ట్రయల్ రన్ నిర్వహించాలని భావించినప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో మొరాదాబాద్-రాంపూర్ మధ్య పరీక్షించారు.
ఈ ట్రైన్ గంటకు 220 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదని అధికార వర్గాలు తెలిపాయి. 16 బోగీలతో ఉండే ఈ రైలులో దివ్వాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు, చిన్న పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. డ్రైవర్ బోగీకి రెండు వైపుల నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కదలికలు తెలుసుకోవడంతో పాటు ప్రమాదాలను నివారించడానికి ఈ కెమెరాలు ఉపయోగ పడతాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..