ఇండియా:ఇంజిన్ లేని ట్రైన్.. ట్రైయిల్ రన్ సక్సెస్..
- November 19, 2018
ఇండియా:పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇంజిన్ రహిత రైలును ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ట్రైన్-18గా పేర్కొనే ఈరైలు మొరాదాబాద్-రాంపూర్ మధ్య పరుగులు పెట్టింది. వివిధ స్థాయిల్లో రైలు వేగాన్ని, ట్రైన్ బ్రేక్ల పనితీరును పరిశీలించారు. ఈ రైలును మొదట మొరాదాబాద్-బరేలి మధ్య ట్రయల్ రన్ నిర్వహించాలని భావించినప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో మొరాదాబాద్-రాంపూర్ మధ్య పరీక్షించారు.
ఈ ట్రైన్ గంటకు 220 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదని అధికార వర్గాలు తెలిపాయి. 16 బోగీలతో ఉండే ఈ రైలులో దివ్వాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు, చిన్న పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. డ్రైవర్ బోగీకి రెండు వైపుల నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కదలికలు తెలుసుకోవడంతో పాటు ప్రమాదాలను నివారించడానికి ఈ కెమెరాలు ఉపయోగ పడతాయి.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..