రీ-షూట్ కి పారితోషికం అడిగిన సాయిపల్లవి
- November 20, 2018హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా పడి పడి లేచె మనసు రూపొందుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. సుధాకర్ - ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని సీన్స్ రీ- షూట్ చేస్తున్నారు.
కొన్ని సీన్స్ మరింత బాగా రావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు రీ షూట్ ను ప్లాన్ చేశారు. ఇందుకోసం సాయిపల్లవి డేట్స్ మళ్లీ అవసరమయ్యాయి. అయితే కొత్తగా ఇచ్చే డేట్స్ కి కూడా పారితోషికం ఇవ్వవలసిందేనని సాయిపల్లవి అడిగితే అందుకు నిర్మాతలు అంగీకరించినట్టుగా సమాచారం. ఎక్కువ పారితోషికం ఇస్తామన్నా, కథ బాగోలేకపోతే సాయిపల్లవి నో చెప్పేస్తుంది. అలాంటింది ఈ సినిమా రీ-షూట్ కి పారితోషికం అడగడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ప్రతి విషయంలోను సాయిపల్లవి ఒక క్లారిటీతో ఉంటుందని అంటున్నారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్