యూఏఈలో గురుదేవ్ రవిశంకర్ 'హ్యాపీనెస్ ఈవెంట్స్'
- November 20, 2018
యూ.ఏ.ఈ:హ్యుమానిటేరియన్ లీడర్, వరల్డ్ టోలరెన్స్ డే సందర్భంగా, శాంతి ప్రవచనాల్ని అందించారు. నాలుగు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఇచ్చిన సందేశం, అలాగే మెడిటేషన్ గురించి ఆయన చేసిన ప్రసంగాలు చాలామందిని ఆకట్టుకున్నాయి, ఆలోచింపజేశాయి. ఫుజారియా గవర్నమెంట్ ఆహ్వానం మేరకు రవిశంకర్, ఈ పర్యటన చేపట్టారు. మైండ్ ఎక్స్పాన్షన్కి సంబంధించి అద్భుతమైన టెక్నాలజీగా మెడిటేషన్ని అభివర్ణించారు శ్రీశ్రీ రవిశంకర్. మనుషుల్లోని పాజిటివిటీని పెంచడమే మెడిటేషన్ లక్ష్యమని ఆయన చెప్పారు. చర్చలు, వర్క్ షాప్లను యూఏఈలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తూ, ఆర్ట్ ఆఫ్ డి స్ట్రెస్సింగ్పై అవగాహన కల్పించారు. ఫుజారియా, షార్జా, దుబాయ్లలో రవిశంకర్ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నేషనాలిటీస్కి అతీతంగా, బ్యాక్గ్రౌండ్స్కి అతీతంగా పలువురు పాల్గొని, రవిశంకర్ ప్రసంగాల పట్ల ఆకర్షితులయ్యారు. శ్రీశ్రీ రవిశంకర్, 156కి పైగా దేశాల్లో 360 మిలియన్లకు పైగా ప్రజలతో మమేకం అయి, తన సందేశాల్ని వారికి అందించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







