దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ గెల్చుకున్న భారతీయ వలసదారుడు
- November 20, 2018
దుబాయ్కి చెందిన భారతీయ వలసదారుడు నౌషద్ సుబిర్, తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ విజేతగా నిలిచారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్లో భాగంగా టిక్కెట్ 0520 టిక్కెట్ సిరీస్ 286 ఈ బహుమతిని నౌషద్ సుబీర్కి అందించింది. ఆన్లైన్లో సుబీర్ ఈ టిక్కెట్ని కొనుగోలు చేశారు. తాను పనిచేస్తున్న రెడా గ్రూప్కి చెందిన మరో తొమ్మిది మందితో కలిసి ఈ టిక్కెట్ ధరని షేర్ చేసుకున్నారు సుబీర్. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ గెల్చుకోవడంపై సుబీర్ మాట్లాడుతూ, ఈ గెలుపుతో తామంతా లక్కీ అని ప్రూవ్ అయ్యిందని చెప్పారు. దుబాయ్లో 20 ఏళ్ళుగా సుబీర్ నివసిస్తున్నారు. ఈ రాఫెల్ గెల్చుకోవడం ద్వారా సుబీర్ ఈ ఘనతను సాధించిన 137వ ఇండియన్గా రికార్డులకెక్కారు. ఇండియాకే చెందిన పర్వీన్ షేక్ ఆసిఫ్ అనే 43 ఏళ్ళ వ్యక్తికి బిఎండ్బ్యుల ఆర్ 1200 ఆర్ మోటార్ బైక్ ఈ రాఫెల్లో దక్కింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







