దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ గెల్చుకున్న భారతీయ వలసదారుడు
- November 20, 2018
దుబాయ్కి చెందిన భారతీయ వలసదారుడు నౌషద్ సుబిర్, తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ విజేతగా నిలిచారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్లో భాగంగా టిక్కెట్ 0520 టిక్కెట్ సిరీస్ 286 ఈ బహుమతిని నౌషద్ సుబీర్కి అందించింది. ఆన్లైన్లో సుబీర్ ఈ టిక్కెట్ని కొనుగోలు చేశారు. తాను పనిచేస్తున్న రెడా గ్రూప్కి చెందిన మరో తొమ్మిది మందితో కలిసి ఈ టిక్కెట్ ధరని షేర్ చేసుకున్నారు సుబీర్. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ గెల్చుకోవడంపై సుబీర్ మాట్లాడుతూ, ఈ గెలుపుతో తామంతా లక్కీ అని ప్రూవ్ అయ్యిందని చెప్పారు. దుబాయ్లో 20 ఏళ్ళుగా సుబీర్ నివసిస్తున్నారు. ఈ రాఫెల్ గెల్చుకోవడం ద్వారా సుబీర్ ఈ ఘనతను సాధించిన 137వ ఇండియన్గా రికార్డులకెక్కారు. ఇండియాకే చెందిన పర్వీన్ షేక్ ఆసిఫ్ అనే 43 ఏళ్ళ వ్యక్తికి బిఎండ్బ్యుల ఆర్ 1200 ఆర్ మోటార్ బైక్ ఈ రాఫెల్లో దక్కింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









