పాన్ కార్డు రూల్స్ సడలించిన సీబీడీటీ
- November 21, 2018
ఢిల్లీ: పర్మనెంట్ అకౌంట్ నంబర్ - పాన్ కార్డులో తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొవాలనే నిబంధన ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో తండ్రి పేరు రాయాల్సిన అవసరం లేదంటూ సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి) అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు నిబంధనలు సడలిస్తూ మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే తల్లి మాత్రమే ఉండి తండ్రి లేనివారికి మాత్రమే ఈ నయా రూల్ వర్తిస్తుంది.
తండ్రి చనిపోయిన పక్షంలో లేదంటే తమను తండ్రి వదిలిపెట్టి వెళ్లిపోయిన వారికి మాత్రమే ఈ నిబంధనను సడలించారు. వీరు కచ్చితంగా తండ్రి పేరును అప్లికేషన్ లో నింపాల్సిన అవసరముండదు. డిసెంబర్ 5 నుంచి కొత్తగా మార్చిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఫైనాన్సియల్ ఇయర్ లో రెండున్నర లక్షల రూపాయలకు మించి ట్రాన్సక్షన్స్ జరిపే సంస్థలు, కంపెనీలు ఇకపై కచ్చితంగా పాన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకోవాలని తెలిపింది. మే 31 వరకు గడువు ఇస్తూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







