పాన్ కార్డు రూల్స్ సడలించిన సీబీడీటీ
- November 21, 2018ఢిల్లీ: పర్మనెంట్ అకౌంట్ నంబర్ - పాన్ కార్డులో తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొవాలనే నిబంధన ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో తండ్రి పేరు రాయాల్సిన అవసరం లేదంటూ సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి) అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు నిబంధనలు సడలిస్తూ మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే తల్లి మాత్రమే ఉండి తండ్రి లేనివారికి మాత్రమే ఈ నయా రూల్ వర్తిస్తుంది.
తండ్రి చనిపోయిన పక్షంలో లేదంటే తమను తండ్రి వదిలిపెట్టి వెళ్లిపోయిన వారికి మాత్రమే ఈ నిబంధనను సడలించారు. వీరు కచ్చితంగా తండ్రి పేరును అప్లికేషన్ లో నింపాల్సిన అవసరముండదు. డిసెంబర్ 5 నుంచి కొత్తగా మార్చిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఫైనాన్సియల్ ఇయర్ లో రెండున్నర లక్షల రూపాయలకు మించి ట్రాన్సక్షన్స్ జరిపే సంస్థలు, కంపెనీలు ఇకపై కచ్చితంగా పాన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకోవాలని తెలిపింది. మే 31 వరకు గడువు ఇస్తూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..